వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలో గల,శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాలయానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు హక్కుల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. కందుకూరు, భరణిపాడు గ్రామాల పరిధిలో ఉన్న అగ్రహారం భూములను 2026-2027, 2027-2028 సంవత్సరాలకు సంబంధించిన రెండు సంవత్సరాల కాలానికి కౌలు కాస్తు చేసుకునే హక్కును బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు వివరించారు. ఈ వేలం కార్యక్రమం ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, కౌలుదారులు వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన అధికారులు కోరారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

