హైదరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅథిగా హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. 15 సూర్య కిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఎయిర్ షోను వీక్షించారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.