భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో డిఎస్పి ఎం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ అండ్ సెర్చ్.
డిఎస్పి ఎం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఎం నాగరాజు సమక్షంలో సిఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలోకార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని, పెండింగ్ చలానాలు ఉన్న 37 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను, మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కాలనీ వాసులతో మాట్లాడి గంజాయి రవాణా గాని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా గానీ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.