భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం, పెద్దనల్లబల్లి గ్రామంలో ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక , రైతు వారము సందర్భంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను దగ్గరకు స్వయంగా వెళ్లి రైతులతో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజు చేసి, అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడానికి ముందు ఉంటుందని తెలిపారు. ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.