mvartanews.com
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 2:39 am Digital Edition : MANA MI VARTA NEWS

ఈరోజు  డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.