
టిడిపి యువనేత సిద్దా పవన్ కుమార్..
గోకవరం అక్టోబర్ 2. ( మీ వార్తా ప్రతినిధి )
గోకవరం గ్రామానికి చెందిన తెదేపా యువ నేత సిద్ధ పవన్ కుమార్ దసరా పర్వదినం సందర్భంగా భవాని మాలధారణ చేసి తనతోపాటు గోకవరం పోలవరం నిర్వాసితులు నివసిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన 30 మంది భవాని భక్తులను ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం నిమిత్తం వారిని తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూని, జ్యోతుల నవీన్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ చిన్న సేవా కార్యక్రమం చేస్తున్నానని ఆ భవానీ మాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరి పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు…