mvartanews.com
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 6:17 pm Digital Edition : MANA MI VARTA NEWS

ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు….!<br><br>

హైదరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం నాలుగు పేపర్లలో గ్రూప్-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పేపర్-1 డిసెంబర్ 15న ఉ.10 నుంచి 12.30 వరకు, పేపర్-2 మ.3 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు. ఇక పేపర్-3.. 16న ఉదయం, పేపర్-4 మధ్యాహ్నం జరుగుతుంది.