నిర్మల్,స్నేహిత ఎక్స్ ప్రెస్: లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిన్నారి శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్ (36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.